Driverless train: డ్రైవర్ లేకుండా రైలు పరుగులు.. దేశంలోనే ఫస్ట్.. రేపే ప్రారంభం
- Raju Shaik
- Dec 27, 2020
- 1 min read
దేశంలోనే మొట్టమొదటి పూర్తిస్థాయి ఆటోమేటెడ్ డ్రైవర్లెస్ ట్రైన్ ఢిల్లీలో ప్రారంభం కానుంది. ప్రధాని నరేంద్ర మోదీ రేపు తన చేతుల మీదుగా ఈ హైటెక్ ట్రైన్ను పచ్చజెండా ఊపి ప్రారంభించనున్నారు.

మన దేశంలో రైళ్లు నడవాలంటే లోకో పైలట్ (డ్రైవర్) ఖచ్చితంగా ఉండాల్సిందే. కొన్ని అభివృద్ధి చెందిన దేశాల్లో డ్రైవర్లెస్ ట్రైన్లు నడుస్తున్నాయి. కానీ భారత్లో మాత్రం అలాంటి ఫుల్లీ ఆటోమెటెడ్ డ్రైవర్లెస్ ట్రైన్ ఇప్పటి వరకు లేదు. కానీ సోమవారం నుంచి అందుబాటులోకి రాబోతోంది. దేశంలోనే మొట్టమొదటి పూర్తిస్థాయి ఆటోమేటెడ్ డ్రైవర్ రహిత రైలును ఢిల్లీలో ప్రారంభం కానుంది. ప్రధాని నరేంద్ర మోదీ తన చేతుల మీదుగా ఈ హైటెక్ ట్రైన్ను పచ్చజెండా ఊపి ప్రారంభించనున్నారు. ఢిల్లీ మెట్రోలోని మ్యాగెంటా లైన్లో ఆటోమేటెడ్ రైలు పట్టాలపై రేపటి నుంచి పరుగులు పెట్టనుంది.
డ్రైవర్లెస్ రైలు ప్రత్యేకతలు:
2017 డిసెంబరులో ఢిల్లీ మెట్రోలోని పింక్ లైన్లో 20 కి.మీ. స్ట్రెచ్లో ట్రయల్స్ నిర్వహించారు. ఇందులో అన్అటెంటెడ్ ట్రైన్ ఆపరేషన్స్ (UTO), కమ్యూనికేషన్ బేస్డ్ ట్రైన్ కంట్రోల్ (CBTC) సిగ్నలింగ్ సిస్టమ్ ఉంది.
ఢిల్లీ మెట్రో రైల్ నెట్వర్క్లో లైన్-7, లైన్-8కే డ్రైవర్లెస్ రైళ్లు పరిమితం కానున్నాయి. UTO, CBTC సదుపాయాలు ఈ లైన్లలోనే ఉన్నాయి. ఫేజ్ 3 మెట్రోలో భాగంగా వీటిని ఏర్పాటు చేశారు. ఇక మొట్ట మొదటి డ్రైవర్లెస్ రైలు లైన్ 7లో పరుగులు పెట్టనుంది.
డ్రైవర్లెస్ రైలును ఢిల్లీ మెట్రో పరిధిలోని మూడు కమాండ్ సెంటర్ల ద్వారా నియంత్రిస్తారు. ఇందులో ఎలాంటి మానవ ప్రమేయం ఉండదు. రైళ్లో ఎక్కడైనా సాంకేతిక సమస్యలు వచ్చినా CBTC టెక్నాలజీ సాయంతో వెంటనే పరిష్కరించవచ్చు. హార్డ్వేర్ రీప్లేస్మెంట్ సమయంలో మాత్రమే మనుషుల అవసరం ఉంటుంది. మిగతా అంతా ఆటోమేటిగ్గానే జరిగిపోతుంది.
కమాండ్ సెంటర్లలో ప్యాసింజర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్తో పాటు క్రౌడ్ మానిటరింగ్ను ఇన్ఫర్మేషన్ కంట్రోలర్స్ హ్యాండిల్ చేస్తాయి. సీసీ టీవీ సాయంతో ట్రైన్ ఎక్విప్మెంట్ మొత్తాన్ని రియల్ టైమ్లో రోలింగ్ కంట్రోలర్స్ మానిటర్ చేస్తాయి.
డ్రైవర్లెస్ ట్రైన్ సిస్టమ్ను పరిశీలించడంతో పాటు నిరంతర సమీక్ష కోసం ఓ కన్సల్టెంట్తో పాటు సిస్ట్రా ఎంవీఏ, సిస్ట్రా ఫ్రాన్స్ నేతృత్వంలోని కన్సార్షియంని ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ నియమించింది.
Comments